ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం తొలి ...
గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం
ఇంటర్నెట్ డెస్క్: కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్ను ఓడించి జింబాబ్వే మంచి ఊపు మీదుంది. ఈ క్రమంలో భారత్, జింబాబ్వే జట్ల బలాలు.. ఇప్పటి వరకు ఇరు జట్లు ఆడిన సిరీస్లు.. ఆధిక్యం ఎవరనే విషయాలను తెలుసుకుందాం..
సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, షమీ, రిషభ్ పంత్ తదితరులు లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది. ఈ నెల చివరి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారందరికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో కేఎల్ రాహుల్ - శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా జింబాబ్వేను ఢీకొట్టనుంది. యువ బ్యాటర్లు రుతురాజ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చింది.
జింబాబ్వే.. అంత తేలికేం కాదు
గత జింబాబ్వే జట్టును పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోయినా ఫర్వాలేదు కానీ.. ప్రస్తుతం వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న చకబ్వా రెగిస్ నాయకత్వంలోని జింబాబ్వేను తక్కువగా అంచనా వేయొద్దు. మరీ ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ను చిత్తు చేసి వన్డే, టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. సికిందర్ రజా, కెప్టెన్ రెగిస్తోపాటు ఇన్నోసెంట్ కైయా అదరగొట్టేశారు. సెంచరీలతో జింబాబ్వేను గెలిపించారు. 300కిపైగా పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు. ఇక బౌలింగ్లోనూ రజా, మాదెవెరె, బ్రాడ్ ఇవాన్స్ వంటి బౌలర్లు రాణించారు. అందుకే జింబాబ్వేతో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
ఛాన్స్ ఎవరికి వస్తుందో...?
తుది జట్టులో ఎవరు ఉంటారనేది తొలి వన్డే జరిగే హరారే పిచ్ పరిస్థితిని బట్టి కోచ్ లక్ష్మణ్- కెప్టెన్ కేఎల్ రాహుల్ నిర్ణయిస్తారు. అయితే కేఎల్ రాహుల్-శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే గిల్, దీపక్ హుడా, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో ఆడతారు. మిడిలార్డర్ కీలకం కాబట్టి సంజూ శాంసన్కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక ఆల్రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఉంటే ఇటు బ్యాటింగ్తోపాటు బౌలింగ్లో భారత్కు ప్రయోజనంగా ఉంటుంది. రెగ్యులర్ స్పిన్నర్లుగా కుల్దీప్ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ముగ్గురు పేసర్లు అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరిలో ఇద్దరికి అవకాశం రావొచ్చు. సీనియారిటీ ప్రకారం సిరాజ్, ప్రసిధ్ ఛాన్స్ ఉంటుంది.
ఆధిక్యం ఎవరిదంటే..?
ఇప్పటి వరకు భారత్ - జింబాబ్వే జట్లు ముఖాముఖిగా 63 వన్డే మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ అత్యధికంగా 51 విజయాలను నమోదు చేయగా.. జింబాబ్వే కూడా 10 మ్యాచుల్లో గెలవడం విశేషం. మరో రెండు మ్యాచుల్లో ఎలాంటి ఫలితం తేలలేదు. ఇరు జట్లూ ఎనిమిది ద్వైపాక్షిక సిరీసుల్లో ఢీకొట్టగా.. ఏడింటిని భారత్, ఒక సిరీస్ను జింబాబ్వే సొంతం చేసుకున్నాయి.
* అత్యధిక స్కోరు: గుహవాటి వేదికగా 2002లో జరిగిన మ్యాచ్లో భారత్ 333/6. దినేశ్ మోంగియా (159) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
* అత్యధిక వ్యక్తిగత స్కోరు: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. 1983 ప్రపంచకప్లో 175 పరుగులతో నాటౌట్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 60 ఓవర్ల మ్యాచ్లో 138 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు.
* అత్యల్ప స్కోరు : భారత్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 65 పరుగులకే కుప్పకూలింది. ఇర్ఫాన్ పఠాన్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (5/27)
* అత్యధిక పరుగులు: జింబాబ్వేపై సచిన్ తెందూల్కర్ అత్యధికంగా పరుగులు సాధించాడు. 49.17 సగటుతో 34 మ్యాచుల్లో 1,377 పరుగులు చేశాడు.
* అత్యధిక వికెట్ల వీరుడు: అజిత్ అగార్కర్ జింబాబ్వేపై 26 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.
* అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ ప్రదర్శన: జింబాబ్వేపై 2013లో జరిగిన వన్డేలో అమిత్ మిశ్రా (6/48) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM