Mawsynram: అత్యధిక వర్షపాత ప్రాంతం మాసిన్రాం.. ఈ విశిష్టతలు తెలుసా?
‘తొమ్మిది రాత్రుళ్లు.. తొమ్మిది పగళ్లు’.. మేఘాలయలోని ‘మాసిన్రాం’ ప్రజలు వర్షాకాలం తీవ్రత గురించి చెప్పే మాట ఇది. దీన్నిబట్టి.. అక్కడ వర్షాల జోరు అర్థం చేసుకోవచ్చు! అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఎక్కడంటే...
ఇంటర్నెట్ డెస్క్: ‘తొమ్మిది రాత్రుళ్లు.. తొమ్మిది పగళ్లు’.. మేఘాలయలోని ‘మాసిన్రాం’ ప్రజలు వర్షాకాలం తీవ్రత గురించి చెప్పే మాట ఇది. దీన్ని బట్టి.. అక్కడ వర్షాల జోరు అర్థం చేసుకోవచ్చు! అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఎక్కడంటే సాధారణంగా ముందుగా గుర్తొచ్చేది చిరపుంజి. కానీ.. వాస్తవానికి, ఈ రికార్డు పొరుగునే ఉన్న మాసిన్రాం పేరిట ఉంటుంది. ఇక్కడి వార్షిక సగటు వర్షపాతం దాదాపు 11,871 మి.మీ. తూర్పు ఖాసీ కొండల్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం.. ప్రపంచంలోనే అత్యధిక తేమగల ప్రాంతంగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటుదక్కించుకుంది. బంగాళాఖాతం నుంచి వీచే గాలుల కారణంగా ఇక్కడ తేమ అధికం. 1985లో ఇక్కడ అత్యధికంగా 26 వేల మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైంది. ఇదీ గిన్నిస్ రికార్డులకెక్కింది.
రికార్డు స్థాయి వర్షపాతం..
చిరపుంజికి 15 కి.మీ దూరంలో ఉన్న మాసిన్రాం.. ఇటీవల వర్షపాతంలో సరికొత్త రికార్డు నెలకొల్పి మరోసారి వార్తల్లోకెక్కింది. జూన్ 16న ఇక్కడ 24 గంటల వ్యవధిలో ఏకంగా 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఒక్క రోజులోనే.. ఏడాది సగటు వర్షపాతంలో 10 శాతం వరకు కురిసింది. దీంతో.. గతంలో ఇక్కడ 1966లో నమోదైన 945.4 మిల్లీమీటర్ల రికార్డును అధిగమించినట్లయింది.
జీవన విధానం భిన్నం..
మాసిన్రాం జనాభా దాదాపు 4 వేలు. తరచూ వర్షాలు పలకరిస్తూ ఉండటంతో.. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ తేమగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక్కడి ప్రజల జీవన శైలి భిన్నంగా ఉంటుంది. వస్త్రధారణ మొదలు.. ఆహారం, పనులు ఇవన్నీ వేరుగా ఉంటాయి.
* స్థానికులు ఎల్లవేళలా ‘నప్’గా పిలుచుకునే వెదురుతో చేసిన సంప్రదాయ గొడుగులను వెంట ఉంచుకుంటారు. దుస్తులను బయట ఆరేసేందుకు వీలుండదు. కాబట్టి.. వాటిని మెటల్ డ్రైయర్లలో ఉంచుతారు. ఇళ్లలో హీటర్లు ఉంటాయి. నిత్యం వర్షంతో ఇళ్లలోకీ పొగమంచు ప్రవేశిస్తుంది. ఫలితంగా గోడలు, వస్తువులు.. అన్ని తేమగా ఉంటాయి.
* ఎడతెరిపి లేని వర్షాల కారణంగా.. వ్యవసాయం చేసే అవకాశం దాదాపు ఉండదు. స్థానికులు చిన్నచిన్న వ్యాపారాలకు ప్రాధాన్యం ఇస్తారు. కావాల్సిన కూరగాయలు, నిత్యవసరాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిందే. వాటిని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి విక్రయిస్తుంటారు.
* ఏటా మే నెల నుంచి అక్టోబరు వరకు భారీ వర్షాలు నమోదవుతాయి. కుండపోత కారణంగా ఆ సమయంలో వారాలపాటు సూర్యుడు కనిపించడు! దీంతో ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం అవుతారు. ఆ సమయంలో ఉడికించిన బంగాళాదుంపలను ఎండు చేపలు, మిరపకాయలు టమాటాలతో చేసిన చట్నీ(టుంగ్టాప్)తో తినడానికి ఆసక్తి చూపుతారు.
* అధిక వర్షపాతం కారణంగా ఇక్కడి రోడ్లు తరచూ దెబ్బతింటాయి.అందుకే, వాటి మరమ్మతులకే ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. వంతెనలదీ అదే దుస్థితి. కొన్ని చోట్ల రబ్బరు, వెదురుతో చిన్నపాటి బ్రిడ్జిలు నిర్మిస్తుంటారు. నీళ్లతో త్వరగా పాడవని గుణం, ఎక్కువ బరువును తట్టుకునే సామర్థ్యం వాటి సొంతం.
* మాసిన్రాం.. సహజసిద్ధ అందాలకూ ప్రసిద్ధి. దీంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి బారులు తీరుతుంటారు! ఇక్కడి జలపాతాలు, పొగమంచు, దట్టమైన మేఘాలు ఆకట్టుకుంటాయి. మాసిన్రాం సమీపంలో సహజసిద్ధంగా ఏర్పడిన మాజిమ్బ్యూయిన్ గుహలు ప్రత్యేక ఆకర్షణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే