Road Accident: ప్రైవేటు బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు

ప్రైవేట్‌ బస్సు బోల్తాపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నల్లజర్ల శివారులో అర్ధరాత్రి తర్వాత ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సు

Updated : 17 Aug 2022 13:20 IST

నల్లజర్ల: ప్రైవేట్‌ బస్సు బోల్తాపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నల్లజర్ల శివారులో అర్ధరాత్రి తర్వాత ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. 35 మంది ప్రయాణికులతో గుంటూరు నుంచి విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను  ఏలూరు ప్రభుత్వాసుత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని