అరవై ఏళ్ల వయసులో వరుస హత్యలు
డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని నాగారానికి చెందిన అల్లెపు మల్లయ్య అలియాస్ రాజు అరవై ఏళ్ల వయసులో
ఘరానా హంతకుడి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీపీ నాగారాజు, చిత్రంలో ఏసీపీ, సీఐలు, ఎస్సైలు
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని నాగారానికి చెందిన అల్లెపు మల్లయ్య అలియాస్ రాజు అరవై ఏళ్ల వయసులో వరుస హత్యలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇతనిపై వివిధ జిల్లాల్లో 16 కేసులు నమోదై ఉన్నాయి. కమిషనరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు.
* మల్లయ్య కొంతకాలంగా దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డితోపాటు నిజామాబాద్లో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆగస్టు 24న మాక్లూర్ మండలం డీకంపల్లి వద్ద పత్తి లక్ష్మి(56) మృతదేహం లభించింది. చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆమె ఆటో ఎక్కిన అనంతరం ఇలా జరిగింది. ఆటో ఆధారంగా మాక్లూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మల్లయ్యతో పాటు అతని అల్లుడు పోశెట్టిని నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మల్లయ్య పాత నేరస్థుడిగా తేలింది. 2019లో జక్రాన్పల్లిలో ఓ మహిళ తలపై దాడి చేసి నగలు అపహరించుకెళ్లాడు. 2020లో ముప్కాల్ మండలంలోని పంట పొలంలో ఉన్న మహిళను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. జులైలో కామారెడ్డి జిల్లా లింగంపేటలో కిరాణా దుకాణంలో ఉన్న మహిళపై దాడి చేసి నగలు ఎత్తుకెళ్లాడు. అతని నుంచి 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ నేతృత్వంలోని సీఐలు రాజశేఖర్, నరహరి, ఎస్సైలు యాదగిరిగౌడ్, రాజేశ్వర్ గౌడ్, సిబ్బంది రామకృష్ణ, వేణు, ప్రవీణ్, నీలేష్, అప్సర్ బృందాన్ని సీపీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434