బేర్ పంజా
బేర్ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల
4 రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు ఆవిరి
డాలర్తో పోలిస్తే రూపాయి 81.67కు
బేర్ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల కారణంగా డాలర్తో పోలిస్తే రూపాయి తాజా జీవనకాల కనిష్ఠానికి చేరడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. సోమవారం మరో 58 పైసలు కోల్పోయిన రూపాయి రికార్డు కనిష్ఠమైన 81.67కు పడిపోయింది. బ్యారెల్ ముడిచమురు ధర 0.75 శాతం తగ్గి 85.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నీరసంగానే ట్రేడయ్యాయి. గత 8 ట్రేడింగ్ రోజుల్లో విదేశీ మదుపర్లు బిలియన్ డాలర్ల (రూ.8000 కోట్లకు పైగా) షేర్లను అమ్మేశారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
* సూచీల వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు తగ్గి రూ.270.11 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్ ఉదయం 57,525.03 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 57,038.24 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. అనంతరం కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆఖరి గంటన్నరలో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 953.70 పాయింట్ల నష్టంతో 57,145.22 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 311.05 పాయింట్లు క్షీణించి 17,016.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,978.30- 17,196.40 పాయింట్ల మధ్య కదలాడింది.
* హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ షేరు అరంగేట్రం అదిరింది. ఇష్యూ ధర రూ.330తో పోలిస్తే బీఎస్ఈలో 34.54% లాభంతో రూ.444 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో 59.87% దూసుకెళ్లి రూ.527.60 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 47.24% లాభంతో రూ.485.90 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,423.83 కోట్లుగా నమోదైంది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 24 కుదేలయ్యాయి. మారుతీ 5.49%, టాటా స్టీల్ 4.22%, ఐటీసీ 3.96%, యాక్సిస్ బ్యాంక్ 3.40%, ఎన్టీపీసీ 3.35%, బజాజ్ ఫైనాన్స్ 3.34%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.87%, ఎం అండ్ ఎం 2.83%, బజాజ్ ఫిన్సర్వ్ 2.60%, రిలయన్స్ 2.54% మేర డీలాపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 1.31%, హెచ్సీఎల్ టెక్ 1.28%, ఇన్ఫోసిస్ 1.06%, అల్ట్రాటెక్ 0.50% రాణించాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. స్థిరాస్తి 4.29%, వాహన 3.86%, యుటిలిటీస్ 3.72%, విద్యుత్ 3.71%, కమొడిటీస్ 3.32%, ఇంధన 3.17%, చమురు-గ్యాస్ 3.10%, టెలికాం 2.97% పడ్డాయి. బీఎస్ఈలో 2980 షేర్లు నష్టాల్లో ముగియగా, 611 స్క్రిప్లు లాభపడ్డాయి. 116 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
అనిల్ అంబానీకి ఉపశమనం: నల్ల ధన నిరోధక చట్టం కింద నమోదైన పన్ను ఎగవేత కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఉపశమనం లభించింది. ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులపై నవంబరు 17 వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశించింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.814 కోట్లకు పైగా వెల్లడించని మొత్తంపై, అనిల్ అంబానీ రూ.420 కోట్ల పన్ను ఎగవేశారని ఐటీ విభాగం ఆరోపిస్తోంది. అనిల్ అంబానీ ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేశారని, భారత పన్ను అధికారులకు విదేశీ బ్యాంక్ ఖాతా వివరాలను కావాలనే వెల్లడించలేదని అభియోగాలు మోపింది.
* 2022-23లో కొత్తగా 100 తెరలను ప్రారంభించేందుకు రూ.350 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు పీవీఆర్ సినిమాస్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఐనాక్స్ లీజర్తో విలీనం పూర్తి కావొచ్చని పీవీఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ గౌతమ్ దత్తా పేర్కొన్నారు.
* తమ ప్లాట్ఫామ్పై ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ (ఈజీఆర్)లను తీసుకొచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తుది అనుమతి లభించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. చిన్న మదుపర్లు, వాణిజ్యసంస్థలు, దిగుమతిదార్లు, బ్యాంకులు, రిఫైనరీ సంస్థలు, బులియన్ ట్రేడర్లు, ఆభరణాల తయారీదార్లు, రిటైల్ వ్యాపారులు కూడా వీటిని ట్రేడ్ చేసేందుకు త్వరలో అవకాశం కల్పిస్తామని తెలిపింది.
* ఉత్తర ప్రదేశ్, హరియాణల్లో 33.3 లక్షల ఐఓటీ ఆధారిత స్మార్ట్మీటర్లను ఇన్స్టాల్ చేయనున్నట్ల వొడాఫోన్ ఐడియా, ఈఈఎస్ఎల్ తెలిపాయి. ఇప్పటికే ఈ కంపెనీలు 16.7 లక్షల స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా